తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు బ‌దిలీ..

తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీలు జ‌రిగాయి. ఈసారి 13 మంది ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్ గా నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు నియమితులయ్యారు. బదిలీ అయిన ఐఏఎస్ వివరాలను పరిశీలిస్తే..

* టి.కె. శ్రీదేవి – పురపాలక శాఖ డైరెక్టర్
* మంద మకరందు – సీసీఎల్ఎ ప్రాజెక్టు డైరెక్టర్
* జెడ్.కె. హనుమంతులు – పర్యాటకశాఖ డైరెక్టర్
* దేవాదాయశాఖ సంచాలకులుగా జెడ్. కె. హనుమంతులకు అదనపు బాధ్యతలు
* శశాంక- రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్
* ఎస్.హరీశ్ – ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్
* హరీశ్ కు విపత్తు నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
* వినయ్ కృష్ణారెడ్డి – ఆర్ అండ్ ఆర్ భూసేకరణ కమిషనర్
* ఆయేషా మస్రత్ – వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి
* వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు
* కె. చంద్రశేఖర్రెడ్డి – డెయిరీ కార్పొరేషన్ ఎండీ
* ఎస్. దిలీప్ కుమార్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్
* సోని బాలదేవి – క్రీడాశాఖ సంచాలకులు (అదనపు బాధ్యతలు)
* కొర్రా లక్ష్మి – రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ
* స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ గా కొర్రా లక్ష్మికి అదనపు బాధ్యతలు
* ఎన్. క్షితిజ – ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ
* సుభద్రా దేవి – జీహెచ్ఎంసీ అక్షన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్
* జి.జ్ఞానేశ్వర్- వికారాబాద్ డీఎఫ్ఓ