తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ..

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్ కొనసాగనున్నారు.

బదిలీ అయిన ఇతర ఐఏఎస్ అధికారుల వివరాలు..

  • బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ.శ్రీధర్
  • దేవాదాయ శాఖ కమిషనర్ గా ఇ. శ్రీధర్ కు అదనపు బాధ్యతలు
  • మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్
  • జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబరితి
  • రవాణాశాఖ కమిషనర్ గా కె. సురేంద్ర మోహన్
  • ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా సీహెచ్ హరికిరణ్
  • ట్రాన్స్ కో సీఎండీగా డి. కృష్ణ భాస్కర్
  • డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్న కృష్ణభాస్కర్
  • ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ గా సృజన
  • ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్. కృష్ణ ఆదిత్య