ACBకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం

  • ఇరిగేషన్ AEE నిఖేష్ కుమార్ ఇంట్లో ACB సోదాలు
  • పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
  • దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తింపు
  • నిఖేశ్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు
  • PCB అధికారుల అవినీతి బాగోతం ఏసీబీకి కనపడటం లేదా..?
  • PCBలోని భారీ అవినీతి తిమింగలంపై ACBతో పాటు పలు సంస్థలకు ఫిర్యాదు చేయనున్న పర్యావరణ వేత్తలు..
  • ప్రజల ప్రాణాలతో చెలగటమడుతున్న కాలుష్య పరిశ్రమలను పట్టించుకోకుండా భారీగా లంచాలు తీసుకుని కోట్లకు పడగలు ఎత్తుతున్న అవినీతి PCB అధికారుల బాగోతం ACB అధికారులకు కనపడటం లేదా..? లేక ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదులే అనుకుంటున్నారా..?
  • త్వరలో పూర్తి ఆధారాలతో కొంత మంది అవినీతి PCB అధికారులపై ఫిర్యాదు చేయనున్న పర్యావరణ వేత్తలు..
  • PCBలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడా బెట్టిన అవినీతి తిమింగలాలు చాలానే ఉన్నాయని చెబుతున్నా పలువురు పర్యావరణ వేత్తలు. ఈ అవినీతి తిమింగలాలపై చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాలను.. పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్న పలువురు పర్యావరణ వేత్తలు.

తెలంగాణ ఏసీబీ (ACB) అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. నిఖేష్ ఇంటితో పాటు బంధువుల నివాసాలలో 25 నుంచి 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిఖేష్ కుమార్ ఆస్తుల విలువ రూ.150 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేష్ కుమార్ కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని 25 ప్రదేశాలలో ఏసీబీ దాడులు చేసింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నిఖేశ్ కుమార్ గతంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.. ఈ కేసులో మే నెలలో జైలు పాలయ్యారు. ఈ కేసు విచారణలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ వెలికితీసిన ఆస్తులలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. నిఖేశ్ కుమార్ ను ఈ ఏడాది మేలో ఒక ప్రత్యేక కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి అనే ఫిర్యాదుదారుడి నుంచి ఏఈఈ నిఖేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజినీర్ కె. కార్తీక్, సర్వేయర్ పి. గణేష్ సర్వేయర్ తో కలిసి రూ. 1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాంపూర్ ఓ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్వోసీ ఇచ్చేందుకు, ఫార్వార్డ్ చేయడానికి అధికారులు రూ. 2,50,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో అప్పటికే రూ.1,50,000 అడ్వాన్స్ గా చెల్లించగా, మిగిలిన రూ.1,00,000 అందజేస్తున్న సమయంలో ఏసీబీ దాడి చేసింది. సర్వేయర్ గణేష్ సర్వే చేయడానికి రూ. 40,000 డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ… నిఖేష్ కుమార్ ఆస్తులపై ఆరా తీసింది. నిఖేష్ కుమార్ నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టి శనివారం ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలోని 30 వరకు చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ సోదాల్లో భారీగా వ్యవసాయ భూములు, భవనాలు, భారీగా బంగారం, ఫామ్ హూస్ ఇతర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.100 -రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గండిపేట బఫర్ జోన్, ఎఫ్ఎఎల్లో నిబంధనలకు విరుద్దంగా నిఖేష్ కుమార్ అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, రాజేంద్రనగర్, మణికొండ పరిధిలో నిఖేష్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆయన పేరిట మూడు ఇళ్లు, రూ.80 కోట్ల ఫామ్ హౌస్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన నిఖేష్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ కేసులో సస్పెండ్ అయిన నిఖేష్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నా… ఆయనపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది.

ప్రజల ప్రాణాలతో చెలగటమడుతున్న కాలుష్య పరిశ్రమలను పట్టించుకోకుండా భారీగా లంచాలు తీసుకుని కోట్లకు పడగలు ఎత్తుతున్న అవినీతి పీసీబీ (PCB) అధికారుల బాగోతం ఏసీబీ (ACB) అధికారులకు కనపడటం లేదా..? లేక ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదులే అనుకుంటున్నారా..? త్వరలో పూర్తి ఆధారాలతో కొంత మంది అవినీతి పీసీబీ అధికారులపై ఫిర్యాదు చేయనున్న పర్యావరణ వేత్తలు.. పీసీబీలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడా బెట్టిన అవినీతి తిమింగలలు చాలానే ఉన్నాయని చెబుతున్నా పలువురు పర్యావరణ వేత్తలు. ఈ అవినీతి తిమింగలపై చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాలను.. పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్న పలువురు పర్యావరణ వేత్తలు.