రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తాడిచెర్ల ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరిస్తూ ఈ రోజు కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఇస్లావత్ నరేశ్, కొయ్యూరు సర్పంచ్ సిద్ది లింగమూర్తి, కో ఆప్షన్ సభ్యుడు ఆయుబ్ ఖాన్ తో కలిసి మూడు మొక్కలను నాటారు. అనంతరం రేగొండ ఎస్సై కృష్ణ ప్రసాద్, చిట్యాల ఎస్సై వీరభద్రం, మహా ముత్తారం ఎస్సై చల్ల రాజు లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమం అనంతరం కాటారం సిఐ హతిరాం కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.