సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీబరాజ్‌ను సందర్శించనున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..
* ఇవాళ ఉదయం 8.50 గంటలకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.05 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు.
* 9.30 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుని శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. గోదావరిఘాట్‌ను కూడా సందర్శిస్తారు.
* ఉదయం 10.10 గంటలకు అక్కడినుంచి తిరిగి పయనమవుతారు.
* ఉదయం 10.30 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి గ్రామ పరిధిలోని లక్ష్మీబరాజ్‌కు చేరుకుంటారు. బరాజ్‌ను సందర్శిస్తారు.
* మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసి.. రెండుగంటలకు హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు బయలుదేరుతారు.
* 2.40 గంటలకు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి చేరుకుని..వీలును బట్టి హైదరాబాద్‌ తిరుగుపయనమవుతారు.