హెచ్సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనునున్నది. హెచ్సీయూలో విధ్వంసానికి సంబంధించిన వివరాలన్నింటిని పరిశీలించడానికి ఏప్రిల్ 10న సెంట్రల్ ఎంవపర్డ్ కమిటీ హెచ్సీయూ విధ్వంసాన్ని పరిశీలించింది.
అక్కడి విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల ఒపీనియన్స్ సైతం సేకరించింది. కాగా, అక్కడ జరిగింది విధ్వంసమే.. చెట్లు, జంతువులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదికను ఏప్రిల్ 15న కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. అదే రోజు ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఇదే సమయంలో మే 15 వరకు మీరు హెచ్సీయూ అడవుల్లో కూల్చిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలని.. అలా ఇవ్వకపోతే సీఎస్ను జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించింది. చెట్లను నాటడానికి ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తారో చెప్పాలంటూ సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం, సీఎస్ను ఎవరినీ కూడా ఉపేక్షించబోమని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వనున్నది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు విచారణ చేయనున్నది.