సుప్రీంకోర్టు సి.జె. జస్టిస్ గవాయ్ కు ఘన స్వగతం పలికిన సి.ఎస్, డీజీపీ లు

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు నేడు సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. షంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తో పాటు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పగిడిగంటం శ్రీ నర్సింహా లకు రాష్ట్ర హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ డా. జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ సిపి హొహంతి, ఏ.జి. సుదర్శన్ రెడ్డి తదితరులు ఘం స్వగతం పలికారు.