యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంధీ చర్యలు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

  • క్యూ లైన్స్ తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ePOS మిషన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టడం జరిగింది.

రైతులకు ముందుగానే టోకెన్లు జారీ
చేసి క్యూ లైన్లు లేకుండా తోపులాటలు లేకుండా యూరియా పంపిణీ సజావుగా సాగింది .యూరియా పంపిణీ పై మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ మొదటి రోజు ఎలాంటి ఆందోళనలు లేకుండా సజావుగా సాగుతుండటంతో అదే పద్ధతిలో పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జియో పాలిటిక్స్ వల్ల యూరియా ఇంపోర్ట్ లేకపోవడం ,దేశీయంగా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు లేకపోవటం వల్ల తెలంగాణ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ఆగస్ట్ లో అదనంగా నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నామని ఇక మీదట ప్రతి రోజు పది వేల మెట్రిక్ టన్నుల యూరియా వివిధ కంపెనీలు సరఫరా చేసేలా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి తో యూరియా సరఫరా మెరుగు పడిందని మంత్రి తుమ్మల తెలిపారు.కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థంతో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద కావాలని ఆందోళనలు చేసి రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని రైతులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల కోరారు. రైతులకు ప్రజా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందనీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు.