పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి – మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్బంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీచేశారు. అనంతరం జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ యానాల అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ సాంబశివరావు, తాసిల్దార్‌ రాధ, టీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షుడు సట్టు సత్తయ్య, దూదిమెట్ల