సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రేవంత్రెడ్డి సర్కారును నిలదీశారు. మంగళవారం హైదరాబాద్లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికశాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
