కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని(1974-2025) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, KU వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి పలువురుజ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి కామెంట్స్.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉన్నది. నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటీ, ఇండస్ట్రీస్ డైనమిక్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, K.U వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి గారికి,ఇతర అతిథులకు,యూనివర్సిటీ ఫ్యాకల్టీ, పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గోల్డెన్ జూబ్లీ పురస్కరించుకుని నిర్వహుకులు ఈ విశిష్ట సదస్సును నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న KU ఫార్మా అల్యూమ్ని అసోసియేషన్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. పూర్వ విద్యార్థులు అంతా తిరిగి ఒక వేదికను ఏర్పరచుకుని సమాజానికి వారిందిస్తున్న సేవలు గుర్తు చేసుకోవడం, భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశనం చేయడం..విలువలతో కూడిన విద్యకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫార్మసీ వృత్తి అనేది సమాజం పట్ల హ్యుమానిటీకి,పరిశోధన, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. “డాక్టర్ ట్రీట్ మెంట్ చేస్తారు…ట్రీట్ మెంట్ లో ఇచ్చే మెడిసిన్ పేషంట్ ను క్యూర్ చేస్తుంది. ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది,దేనికి పనిచేస్తుంది,ఎంత మోతాదు అనే పరిశోధన చేసేది మీరే కదా..
ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం మీరు అందించే సేవలు వెలకట్టలేనివి. సమాజం కోసం మీ మేధస్సును దారపోస్తారు. నల్గొండ జిల్లా సంకిశాల ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి 35 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నారు. ఆయన న్యూ యార్క్ లో బ్యాక్టోలాక్ ఫార్మాస్యూటికల్,పలు కంపెనీలకు చైర్మన్ గా ఉన్నారు. ఆయన మార్కెట్ నెట్ వర్త్ సుమారు 10వేల కోట్లు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి గారి లాంటి వారిని నేటి ఫార్మా విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలి. విద్య అనేది మనలో వెలుగు నింపుతుంది, తరతరాలకు ప్రేరణ ఇస్తుంది. అందుకే మా నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో కొత్తగా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులు ఏర్పాటుకు కృషి చేశాను. నల్గొండ ప్రాంతంలో దివీస్ లాంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇట్లాంటి సంస్థలు తెలంగాణ నే కాదు యావత్ భారతదేశాన్ని అభివృద్ధిలో, నూతన ఆవిష్కరణలో,సమాజ సేవ మార్గంలో నంబర్ వన్ గా నిలిపే మూల స్తంభాలుగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత అయిదు దశాబ్దాలుగా యూసిపిఎస్సి ఔషధ విద్య, పరిశోధన మరియు సామాజిక సేవల్లో అగ్రగామిగా నిలిచింది. విద్యార్థుల్లో మేధస్సుతో పాటు నైతిక విలువలను పెంపొందించడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అకాడమిక్, ఇండస్ట్రీ, నియంత్రణ సంస్థలలో నాయకులుగా ఎదిగేలా చేసింది. ఇక్కడి పూర్వ విద్యార్థులు పరిశ్రమలలో, పరిశోధనలో, నియంత్రణ సంస్థలలో చేసిన కృషి ఈ సంస్థ యొక్క దూరదృష్టి మరియు సమగ్ర విద్యను ప్రతిబింబిస్తుంది. విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అల్యూమ్నీ అందిస్తున్న సహకారం వారికి ఉన్న దాతృత్వ మనసుకు నిదర్శనం. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గత విజయాల జ్ఞాపకాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆవిష్కరణలకు,సహకారానికి ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాను. ఫార్మా రంగం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అనేక చర్యలు చేపడుతుంది.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ORR నిర్మించాం..శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించాం.అది అనేక పరిశ్రమలు వచ్చేందుకు కీలక భూమిక పోషించింది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మించబోతున్నాం..ORR నుండి RRR కు రేడియల్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇది పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుంది. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మా క్యాబినెట్ అంతా కలసి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ఐటీ,ఫార్మా హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ఇక్కడికి వచ్చిన ఫార్మా ప్రముఖులు, ఫ్రొఫెసర్స్ అందరూ మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని,భగవంతుడు వారికి మరింత శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, విద్య, పరిశోధనల ద్వారా రాష్ట్రం మరియు దేశానికి మరింత సేవ చేయాలని ఆశిస్తున్నాను.
