గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వాటర్ మెన్ అఫ్ ఇండియా డాక్టర్ రాజేందర్ సింగ్

ప్రతిష్టాత్మంగా కొనసాగుతున్న గోదావరి జల యాత్ర లో భాగంగా ఈ రోజు ఖమ్మం లోని కవిత ఇంజనీరింగ్ కాలేజీ లో , జల సంరక్షణ మరియు సామజిక బాధ్యత అనే అంశం సదస్సు కు వచ్చిన సందర్భంగా కళాశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడుతూ తెలంగాణ లో మిషన్ కాకతీయ పేరుతొ చెరువులను, నీటి కుంటలను పునరుద్దరించడము వలన, భూగర్భ జలమును పెంచడము ద్వారా పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ మరియు వృక్ష సంపద గణనీయంగా పెరిగిందని.. రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. గత మూడురోజులుగా నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాని పేర్కొన్నారు .
ఈ కార్యక్రమములో వాక్ ఫర్ వాటర్ అధినేత. కరుణాకర్ రెడ్డి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంగం అధ్యక్షులు శ్యామప్రసాద్ రెడ్డి మరియు పద్మశ్రీ వనజీవి రామయ్య పాల్గొన్నారు .