- ఉత్తర తెలంగాణాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ సంకల్పం
దేవాదుల ప్రాజెక్ పూర్తికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా ఉత్తర తెలంగాణాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.(JCRDLIS) జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పధకం పురోగతి పై మంగళవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖామంత్రి దనసరి అనసూయ (సితక్క),లోకసభ సభ్యులు బలరాం నాయక్,శాసనసబ్యులు నాగరాజు,యశశ్వని రెడ్డి, సత్యనారాయణ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారుడు, ఆదిత్య నాధ్ దాస్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఇ. ఎన్.సి.లు అంజద్ హుస్సేన్, రమేష్ బాబు, శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్నీత కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. పాలనాపరమైన అడ్డంకులను సత్వరం తొలగించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గంగారాం గ్రామ సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టి.యం.సి ల నీటిని వరంగల్, హనుమకొండ,కరీంనగర్, జయశంకర్ భుపాలపల్లి, ములుగు, జనగామ, భోనగిరి యాదాద్రి, సూర్యాపేట,సిద్దిపేట జిల్లాలలో 5.57 లక్షల ఏకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆయన వివరించారు. 71 మీటర్ల ఎత్తు నుండి 540 మీటర్ల ఎత్తు వరకు మొత్తం 469 మీటర్ల మేర ఎత్తిపోతల పధకం ఇదని ఆయన తెలిపారు. పంప్ హౌస్ లు,కాలువల తవ్వకాలు,నీటి సరఫరా తదితర పనులు పూర్తి చేసేందుకు గాను మూడు దశలలో పనులు జరుగుతున్నాయన్నారు. 5.56 లక్షల ఎకరాలను సాగు లోకి తేవడానికి ఉద్దేశించ బడిన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 3.17 లక్షల ఏకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. భూగర్భజలాలతో సాగులో ఉన్న 58,028 ఎకరాల విస్తీర్ణంతో కలుపు కుంటే మొత్తం ఆయకట్టు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 18,500 కోట్లు కాగా ఇప్పటి వరకు 14,269,63 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.మిగిలిన పనుల పూర్తికి 4,230 కోట్లు అవసరమౌతాయని ఆయన తెలిపారు. ఖర్చు చేసిన మొత్తంలో నిర్మాణానికి గాను 11,667.85 కోట్లు ఖర్చు చేయగా భూసేకరణ నిమిత్తం 1,343.06 కోట్లు ఖర్చు పెట్టమన్నారు.అంతే గాకుండా హైడ్రో-మెకానికల్-విద్యుత్ అవసరాల నిమిత్తం 1,170.63 కోట్లు ఖర్చు పెట్టమన్నారు. 2,430 కిలోమీటర్ల కాలువ తవ్వల్సి ఉండగా 1,663.10 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తి అయ్యాయని,అదే విదంగా 702.62 కిలోమీటర్ల పైపు లైన్ కు గాను ఇప్పటికి 669.66 కిలోమీటర్ల మేర పూర్తి చేశరని కాలువల లైనింగ్ కుడా799.80 కిలో మీటర్లు పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. 46 ట్యాంక్ లకు గాను 39 పూర్తి కాగా 21 పంప్ హౌజ్ లలో 18 ట్యాన్క్ లు పురోగతిలో ఉన్నాయన్నారు.అధికారికంగా అందించిన గగణాంకాల ఆధారంగా వివిధ విభాగాలలో 67% నుండి 95% మేర పనులు పురోగతి లో ఉన్నాయన్నారు.
ప్రాజెక్టు మొదటి దశలో సాలీన 170 రోజుల పాటు 5.18 టి.యం.సి ల నీటిని పంపిణీ చేయగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుందన్నారు.రెండో దశలో 7.25 టి.యం.సి ల నీటితో మరో 1.83 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. కొత్తగా పంప్ హౌజ్ లు,సొరంగాలు, రిజర్వాయర్ ల నిర్మాణాల ద్వారా 25.75 టి.యం.సి ల నీటిని 2.39 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు మూడవ దశలో పనులు నడుస్తున్నాయన్నారు.అందుకు గాను దీనిని ఎనిమిది ప్యాకేజ్ లుగా విభజన చేసి పనులు మొదలు పెట్టగా ప్యాకేజ్-1,ప్యాకేజ్ఞానజ్-2 పూర్తి అయ్యాయన్నారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయాన్నారు. దేవదుల ప్రాజెక్టు మరియు దాని అనుబంధ కాలువల కింద ఆయకట్టు ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని బహుళ నియోజకవర్గాలలో విస్తరించి ఉందని ఆయన వివరించారు. జనగాం జిల్లాలో, రఘునాథపల్లి మరియు ఆర్.ఎస్. ఘనపూర్ విభాగాలలో 51,000 ఎకరాలతో సహా సుమారు 88,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాటికొండ, కొత్తపల్లి, మీదికొండ, రాఘవపూర్, చాగల్, అశ్వారాపల్లి మరియు గోవర్ధనగిరి వంటి ఏడు గ్రామాలలో కేవలం గాంధిరామారం రైట్ మెయిన్ కెనాల్ సుమారు 5,600 ఎకరాలకు నీరందిస్తుందన్నారు. హనుమకొండ మరియు వరంగల్ నియోజకవర్గాలలో, ఆయకట్టు సామర్థ్యం 1.1 లక్షల ఎకరాలను మించిపోయింది, ములుగు, భూపాలపల్లి మరియు జైశంకర్ విభాగాలు కలిపి 1.2 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయన్నారు.
మిగిలిన ఆయకట్టు సిద్దిపేట, సూర్యాపేట మరియు యాదాద్రి జిల్లాలలో పంపిణీ చేయబడిందని, తద్వారా ఈ ప్రాజెక్టు ఉత్తర మరియు మధ్య తెలంగాణ రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. భూసేకరణ నివేదిక ప్రకారం, అవసరమైన 34,386 ఎకరాలకు గాను 32,079 ఎకరాలను సేకరించారు, కేవలం 2,307 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది, ఇది ప్రధానంగా మూడవ దశ భాగాలలో ఉందని, మిగిలిన భూసేకరణ, లైనింగ్ మరియు మెకానికల్ పనులన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని మరియు మిగిలిన పంపుహౌస్ల ప్రారంభానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిరంతర పురోగతిని నిర్ధారించడానికి కాంట్రాక్టర్ల యొక్క అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండేళ్లలో దేవదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలులోకి తెస్తుందని, తద్వారా సుమారు ఆరు లక్షల ఎకరాలకు నమ్మకమైన సాగునీరు అందిస్తుందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థిరమైన ఆయకట్టును స్థిరీకరించి, పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, ఉత్తర మరియు మధ్య తెలంగాణలోని మెట్ట ప్రాంతాలలో త్రాగునీటి లభ్యతను పెంచుతుందని ఆయన అన్నారు. “ఖర్చు చేసిన ప్రతి రూపాయి పొలాలలోకి నీరు ప్రవహించేలా చేయాలి,” అని ఆయన నొక్కిచెప్పారు, రాష్ట్రవ్యాప్తంగా సమాన సాగునీటి అభివృద్ధి మరియు స్థిరమైన నీటి వినియోగంపై తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.