రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు అత్యుత్తమ ప్రతిభా పురస్కారం రాష్ట్రపతి ద్వారా పొందడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన “ఆది కర్మయోగి అభియాన్” జాతీయ సదస్సులో, తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. భారత రాష్ట్రపతి చేత రాష్ట్ర ప్రతినిధులు జాతీయ అవార్డులు స్వీకరించారు. అడ్డూరి లక్ష్మణ్ గిరిజన మరియు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు,. సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు డా. వి. సముజ్వల, సహాయ సంచాలకులు శ్రీమతి పద్మ పి.వి. ఈ రోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి తమకు వచ్చిన పురస్కారాలను చూపి భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపడుతున్న పథకాలను అందిపుచ్చుకొని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సమర్థవంతంగా అమలుపరిచి గిరిజన సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేసినట్లు వివరించారు. వివరాలు తెలుసుకొని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర విజయాలు: పిఎం–జన్మాన్ (PM–JANMAN) కార్యక్రమంలో తెలంగాణ దేశంలో టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.
ధర్తీ ఆబా జంజాతి గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ (DA JGUA) లో సమాజ భాగస్వామ్యంలో దేశంలో 6వ స్థానంలో నిలిచింది.
ఆది కర్మయోగి అభియాన్ లో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు మరియు ఐటీడీఏలు భద్రాచలం, ఉట్నూర్ జాతీయ స్థాయి అవార్డులు పొందాయి.
ఉత్తమ శిక్షకులుగా పద్మ పివి, డాక్టర్ ఎ. కీర్తి, డాక్టర్ జి. నరేందర్ రెడ్డి లు గౌరవించబడ్డారు.
ఈ గుర్తింపులు తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన కృషికి నిదర్శనం. సమగ్ర గిరిజన అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, మరియు అంతర్‌శాఖ సమన్వయంలో రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.