తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ

  • కాంగ్రెస్‌ పార్టీలో గొడవలు టీకప్పులో తుఫాన్‌ వంటివని వ్యాఖ్య

తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణలు కోరుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్‌ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. గురువారం క్యాబినెట్‌ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఒక కుటుంబమని, టీ కప్పులో తుఫాను మాదిరిగా గొడవలు వస్తాయని చెప్పారు. అపార్థం వల్ల కొన్ని గొడవలు వచ్చాయని తెలిపారు. ఆ రోజు తమ ఇంటికి పోలీసులు రావడంతో తన కూతురు సీఎంపై ఆరోపణలు చేసిందని, ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్తున్నట్టు తెలిపారు.