గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు వారి ఉజ్వల భవిష్యత్ కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్క విద్యార్థికి ఓవర్సీస్ నిధులు20 లక్షలు ఇచ్చాం. 2, 288 సుమారు రూ. 304కోట్ల నిధులు విడుదల చేశాం. ( అక్టోబర్ 2025 లో ) ఇప్పటివరకు 3642 మంది విద్యార్థులకు గాను రూ.463 కోట్లు విడుదల చేశాం. 2022 నుంచి ఈ రోజు వరకు బకాయిలను విడుదల చేశాం. అర్హతకలిగిన విద్యార్థులకు నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న మన తెలంగాణ విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులను విడుదల చేయడం జరిగింది.
ఈ నిధుల విడుదల ద్వారా విద్యార్థుల కలలను నేరవేర్చడంతో పాటు వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను మా ప్రభుత్వం అర్దం చేసుకుంది.
యూకే ,అమెరికా యూరప్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మా ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రస్తుతం విదేశాల్లో అననూకూల పరిస్థితుల కారణంగా మన రాష్ట్ర విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు ఈ నిధుల ద్వారా వారికి ఉపశమనం లభిస్తుంది. సంక్షేమ హాస్టల్స్ లో (ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ) హాస్టల్స్ తక్షణ ఇబ్బందులను అధిగమించేందుకు రూ. 60 కోట్లు విడుదల చేశాం. ఇవి జిల్లా కలెక్టర్లు, సెక్రటరీ పరిధిలో
ఉంచాం. సీఎం సహాయ నిధి నుంచి సంక్షేమ హాస్టల్ పిల్లలకు నిదులు అందించాం. 119 నియోజకర్గాల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ తోని యంగ్ ఇంటి గ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సంక్షేమ హాస్టల్లో ఏ సమస్య ఉన్న తక్షణ పరిష్కారం కోసం నిధులు మంజూరు చేశాం. గత 10 ఏళ్లు పరిపాలించిన వారు సంక్షేమ హాస్టల్స్ పిల్లల డైట్ కోసం ఆలోచన చేయలేదు. మా సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో డైట్ ఛార్జీలు పెంచాం మా అధికారులందరూ సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తక్షణం పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అర్హత ఉన్న వారికే ఇస్తాం …. అనర్హులకు ఇవ్వం. ఈ నిధుల విడుదలకు కృషి చేసిన మా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క కు ధన్య వాదాలు. ఈ సమావేశంలో వెల్ఫేర్ spl.CS సభ్యసాచి గోష్, ఎస్ సి డి డి Prl.Secy సెక్రటరీ బుద్ధ ప్రకాష్, కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.
