కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ దిగ్భ్రాంతి

ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏకాదశి పండుగ సందర్భంగా తెలంగాణలోని అన్ని టెంపుల్స్ లో క్యూ లైన్ లో ఏర్పాట్లు, కనీస వసతుల కల్పనపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ హరీష్ ను ఆదేశించడం జరిగింది.