భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • హస్త కళల కళాకారులకు రాష్ట్ర స్థాయి అవార్డులతొ సన్మానం
  • హస్తకళలు అంతరించిపోకుండా పరిరక్షించాలి
  • గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల

భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లు ఆకట్టుకునేలా నిలుస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నాడు తెలంగాణ హస్తకళల అబివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హెచ్. ఎం డీ. ఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వ్యవసాయ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అంతరించిపోతున్న హస్త కళలను పరిరక్షించాలని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం హస్త కళాకారులకు ఉపాధి దొరికేలా అవకాశాలు కల్పించాలని వెల్లడించారు. ఎంతో ప్రత్యేకమైన హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లను, చేనేత ఉత్పత్తు లను పుణ్య క్షేత్రాలు, ఎయిర్ పోర్టులు రైల్వే స్టేషన్లలో లాంటి ముఖ్యమయిన ప్రాంతాలలో ఏర్పాటు చేసి బాగా ప్రమోట్ చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 150 హస్త కళల మరియు చేనేత ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేసినారు. ఈ సంధ ర్బంగా మంత్రి గారు 2024-25 సంవత్సరమునకు గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది హస్త కళల కళాకారులకు రాష్ట్ర స్థాయి అవార్డులతొ సన్మానించారు. కార్యక్రమంలో హస్తకళల అబివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ
హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్ టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ సువార్చల రాణి పాల్గొన్నారు.