- ఉప్పల్ దారిలో ఇప్పటికే బి.టి రోడ్డు పనులు మొదలు పెట్టాం
- 5.5 కి.మీ గాను 1.5కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తయింది
- మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బి.టి రోడ్డు పూర్తి చేస్తాం
- ఉప్పల్ వరంగల్ మార్గంలో ప్రయాణించే వారికి,మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాం
- రోడ్డు పనులు,ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
- ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం…ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం ఆగే ప్రసక్తే లేదు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2026 దసరా నాటికి ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తాం
హైదరాబాద్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు,ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా బుధవారం నాడు ఆర్ అండ్ బి, MoRTH,అధికారులకు,నిర్మాణ సంస్థకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న గతుకుల రోడ్డు మార్గంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే బిటి రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఉప్పల్ వరంగల్ మార్గంలో అధికారులు ఇప్పటికే బి.టి రోడ్డు పనులు మొదలు పెట్టారు. ఉప్పల్ వరంగల్ మార్గంలో ప్రయాణించే వారికి,మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నామనీ అన్నారు. మొత్తం 5.5 కి.మీ గాను 1.5కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తయిందనీ,మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బి.టి రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. బిటి రోడ్డు పనులు,ఎలివేటెడ్ కారిడార్ పనులు పొద్దున,రాత్రి షిఫ్టుల వారిగా శరవేగంగా కొనసాగుతున్నాయనీ ఇచ్చిన మాట ప్రకారం,రాజకీయాలకు అతీతంగా 2026 దసరా నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు.