తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం.ఆయిల్ పామ్ సాగు అనుమతి కోసం పెట్టిన ఫైలుకు మోక్షం. రాబోయే రెండేళ్లలో 18.100 హెక్టార్లలో (45,250 Acars) ఆయిల్ పామ్ సాగుకు అనుమతిస్తూ లేఖ పంపిన కేంద్రం. 2019 – 20 సంవత్సరానికి గాను 2500 ఎకరాలలో తెలంగాణ ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్ సాగును ప్రారంభించింది. ఏటా 40 వేల కోట్ల రూపాయల పామాయిల్ ను మన దేశం దిగుమతి చేసుకుంటున్నది. రూ.75 వేల కోట్ల విలువైన 21 మిలియన్ టన్నుల నూనెలను మనం దేశం దిగుమతి చేసుకుంటున్నది. 15 మిలియన్ టన్నుల ఆయిల్ పామ్ ను దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణలో 246 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం అని తేల్చిన కేంద్రం సర్వే. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. అధిక ఆదాయంతో పాటు రైతులను పంటమార్పిడి వైపు ప్రోత్సహించినట్లు అవుతుందని ముందుచూపుతో అడుగులు. సాంప్రదాయ పంటల సాగుతో నష్టాల పాలవుతున్న రైతులు. ఇప్పటికే ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టిన ఆయిల్ ఫెడ్. నాలుగేళ్ల నుండి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్ పామ్. అంతర పంటల సాగుకు ఆయిల్ పామ్ అనుకూలం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటకు విపరీతమయిన డిమాండ్. రవాణ ఖర్చులు ఇచ్చి పంటను సేకరిస్తున్న ఆయిల్ ఫెడ్. ఆయిల్ పామ్ ప్రోత్సాహం దిశగా ఇప్పటికే బీచుపల్లి ఆయిల్ మిల్ పున:ప్రారంభానికి చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ గా మార్చేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహనా తరగతులు. కేంద్రం అనుమతి నేపథ్యంలో పంటమార్పిడి వైపుకు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సన్నాహాలు. కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే పంటకాలనీల ఏర్పాటుకు పూర్తయిన నివేదిక. ఆయిల్ పామ్ పంటల సాగుతో తెలంగాణ రైతులకు మరింత మేలు. ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగెకరాలలో ఆయిల్ పామ్ సాగు. 20 శాతం కార్బన్ పీల్చుకునే ఆయిల్ పామ్ మొక్కలు 22 శాతం ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. పర్యావరణపరంగా, రైతుకు లాభాలు అందించేపరంగా ఆయిల్ పామ్ సాగు ఎంతో ఉపయోగం. రైతులు విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. దేశంలో అన్నిరకాల పంటల సాగుకు తెలంగాణ ప్రాంతం అనుకూలం అయినందున తెలంగాణలో వ్యవసాయ రంగానికి చేయూత నివ్వాలని కేంద్రానికి వినతి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా కల్పించి తోడ్పాటు అందించాలి. దేశంలో వ్యవసాయ రంగానికి ఏ రాష్ట్రం ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, అనుమతులు ఇవ్వడం విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. తెలంగాణ రైతులకు మంచి రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయింది. రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో వివిధ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతుల విజయగాధలను వెలుగులోకి తెచ్చి మీడియా సోదరులు ఇతర రైతులకు ప్రోత్సాహం అందించి పంటల మార్పిడికి సహకారం అందించాలి. కంది రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు .. కందులన్నీ కొనుగోలు చేస్తాం అన్నారు.