హైదరాబాద్: హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో ఆదివారం ఆసియా, బౌద్ధ దేశాలు, ఇతర విదేశీ రాయబారులు, హైకమిషనర్లతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. తెలంగాణ బౌద్ధ వారసత్వం, అంతర్జాతీయ పర్యాటక–సాంస్కృతిక భాగస్వామ్యాలపై చర్చించారు. దక్షిణ భారతదేశంలో మహాయాన బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని తెలంగాణకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మంత్రి వివరించారు. నాగార్జునకొండ, ఫణిగిరి, ధూలికట్ట, నెలకొండపల్లి, కోటిలింగాల వంటి బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను రాయబారులకు వివరించారు. నాగార్జునసాగర్లో నిర్మాణం జరుగుతున్న బుద్ధవనం బౌద్ధ హెరిటేజ్ థీమ్ పార్క్ ను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక – పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలియజేశారు.
బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందని అన్నారు. సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనంలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుడి మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారు. భవిష్యత్ తరాలకు బౌద్ధ ధర్మాన్ని పరిచయం చేసే చేసే జీవశిల్పంగా నిలిచిపోతుంది. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వ చేస్తున్న కృషిని వారు అభినందిస్తూ, భవిష్యత్లో సాంస్కృతిక, పర్యాటక, పెట్టుబడి రంగాలలో సహకారానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.
రాబోయే ‘తెలంగాణ రైజింగ్ – 2047 గ్లోబల్ సమ్మిట్’ (డిసెంబర్ 8–9, భారత్ ఫ్యూచర్ సిటీ)లో పాల్గొనాలని మంత్రి రాయబారులను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు
1. హెచ్.ఇ. శ్రీ ముజాఫర్ షా బిన్ ముస్తఫా, హైకమిషనర్ – మలేషియా
శ్రీమతి నజ్వా బింటి జైనాల్
2. హెచ్.ఇ. డా. శంకర్ ప్రసాద్ శర్మ, రాయబారి – నేపాల్
శ్రీమతి కల్పనా శర్మ
3. హెచ్.ఇ. మేజర్ జనరల్ వెట్సాప్ నామ్గయెల్, రాయబారి – భూటాన్
శ్రీమతి డా జామ్
4. హెచ్.ఇ. శ్రీమతి ఛవనార్ట్ థాంగ్సుంఫంట్, రాయబారి – థాయ్లాండ్
శ్రీమతి రూచీ సింగ్, కార్యదర్శి
5. హెచ్.ఇ. శ్రీమతి మహిషిని కొలోన్, హైకమిషనర్ – శ్రీలంక
6. హెచ్.ఇ. శ్రీమతి హారిసోవా అకూష్, హైకమిషనర్ – సెషెల్స్
7. శ్రీ క్లిమెంటే కమేం, రాయబారి – అంగోలా
8. శ్రీ ఎరిక్ జాన్ ఎం. జిన్సూ, రాయబారి – బెనిన్
9. శ్రీ ఎడ్ జాగర్, మినిస్టర్ (కమర్షియల్), హైకమిషన్ – కెనడా
10. శ్రీమతి లినా సోవాని, హైకమిషన్ – కెనడా
11. శ్రీ ఇయాన్ మార్టినస్, ఇన్వెస్ట్మెంట్ & ట్రేడ్ కమిషనర్ – వెస్ట్రన్ ఆస్ట్రేలియా
శ్రీ కుహన్ మధన్
12. శ్రీ ఎ. అజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి (రాష్ట్రాలు) – భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
13. శ్రీ గణేశనాథన్ గియతిశ్వరన్, డిప్యూటీ హైకమిషనర్ – శ్రీలంక
14. శ్రీ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ జనరల్ – సింగపూర్
15. శ్రీ వాలెరి ఖోజ్దాయేవ్, కాన్సుల్ జనరల్ – రష్యా
16. శ్రీ కె. సరవణ కుమార్, కాన్సుల్ జనరల్ – మలేషియా