రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు నాటారు మరో ముగ్గురిని నామినేట్ చేశార , నల్గొండ జిల్లా ఎస్పీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ని మొక్కలు నాటాలిసిందిగా నామినేట్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ భావితరాలకు ఎంతో ఉపయోగకరమైనది. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకి గురిచేస్తున్న సమస్య పర్యావరణ లో వచ్చే పెనుమార్పులు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో హరితహారం ప్రోగ్రాం చేపట్టారు. ఒక 30 , 40 సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి వాతావరణంలోని మార్పులు వాటివల్ల వచ్చే పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారు. ఆ కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన కార్యక్రమం .దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ తనను ఎంతగానో ఆకట్టుకుంది. ట్విట్టర్ వేదికగా ప్రారంభించడం చాలా ఉన్నత వర్గాలను ఆలోచింపజేసేలా ఉందని కావున అందులో భాగంగా ఈరోజు నేను మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అభినందించారు .