పర్యావరణ హితం అందరి అభిమతం కావాలి – ఎస్పీ రంగనాథ్

స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డికి గ్రీన్ ఛాలెంజ్ చేసిన ఎస్పీ రంగనాథ్

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది అందరి అభిమతంగా మారినప్పుడే గ్రీన్ ఛాలెంజ్, హరితహారం లాంటి కార్యక్రమాల లక్ష్యం నెరవేరుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్ అన్నారు.
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నడుస్తున్న గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తన మిత్రుడు వెల్స్ ఫర్గో సంస్థ అధినేత శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మూడు రకాల పండ్ల మొక్కలు నాటారు. అనంతరం తన తరఫున గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిలను ఆయన కోరారు. వారు మూడు మొక్కలు నాటడంతో పాటు ఒక్కొక్కరూ మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేయాలని ఆయన సూచించారు.