నేటి నుంచి ఉచితంగా వినికిడి పరీక్షలు

ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి 6వ తేదీ వరకు తెలంగాణ ఆడియోలజిస్టు అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ పేర్కొంది. సికింద్రాబాద్‌, చార్మినార్‌లలో డా.ఇమద్‌ ఖాన్‌, తార్నాకలో డా.కె.నాగేందర్‌, ఎల్బీనగర్‌లో డా.జి.గీత క్లినిక్స్‌లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.