రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విశాఖపట్నంలోని తన నివాసంలో మొక్కలు నాటిన హైపర్ అది. ఈ సందర్భంగా హైపర్ అది మాట్లాడుతూ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని దీని వల్ల పచ్చదనం పెరగడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు.మరోక ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు. 1) వర్షిని 2) ప్రదీప్ 3) శేఖర్ మాస్టర్