కరోనా ఎఫెక్ట్‌.. రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు బంద్‌

మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఒక ప్రకటలో తెలిపారు.
ఇప్పుడు మనమంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొవిద్‌-19 ను అరికట్టేందుకు మనమంతా పూనుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలనీ.. జనసమూహంలోకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలనీ, కరచాలనం చేయకుండా నమస్కరిస్తే సరిపోతుందని ఆయన తెలిపారు.