బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 11 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.