
టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ సీనియర్ నాయకులు కే. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ సురేశ్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా నియమించినందుకు కేకే, సురేశ్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సంఖ్యా బలం రిత్యా… తెలంగాణకు రెండు రాజ్యసభ సీట్లు దక్కాయి. ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్కు ఉన్న బలాబలాలతో ఈ రెండు స్థానాలను ఆ పార్టీ సులభంగా దక్కించుకోనుంది.