రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటిన పలువురు సినీ నిర్మాతలు, నటులు
మొక్కలు నాటిన నిర్మాతలు కేఎస్ రామారావు, రాజ్ కందుకూరి, సింగర్ ఆర్పీ పట్నాయక్, నటులు శివాజీ రాజా,ఏడిద శ్రీరామ్, బెనర్జీ, కాశీ విశ్వనాద్ కందుకూరి శివ, భవానీ ప్రసాద్ కాదంబరి కిరణ్
హాజరైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్
‘’కేఎస్ రామారావు*
గ్రీన్ ఇండియా చాలెంజ్ రోజు రోజుకు ఎంతో గొప్పగా సాగుతుంది. ఇప్పటికే 5 కోట్ల మొక్కలకు పైగా నాటడం ఎంతో గొప్ప విషయం
ఏడిద శ్రీరామ్
పచ్చదనం పెంచడం కోసం ఎంపీ సంతోష్ గారు తీసుకున్న చర్యలు ప్రశంస నీయం. ఇంకా ప్రజలు భారీగా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాలు పంచుకోవాలి
శివాజీ రాజా
ఎంపీ సంతోష్ పెద్ద భాద్యత ఎత్తుకున్నారు. కోట్లాది మొక్కలు నాటడం అంత ఆషామాషీ కాదు.
రాజ్ కందుకూరి
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా 50 కోట్ల మొక్కలు నాటాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకున్న ఎంపీ సంతోష్ కి ధన్యవాదాలు.
కాశీ విశ్వనాథ్
ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలి.
ఆర్పీ పట్నాయక్
మా సెలెబ్రెటీలను చూసి మరికొంత మంది మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఎలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కి శుభాకాంక్షలు.
కందుకూరి శివ హీరో
చెట్లను నాటాల్సిన అవసరం పెరిగింది. ప్రతిఒక్కరు ఈ గొప్ప పనిలో భాగ స్వామ్యం కావాలి.
బెనర్జీ
ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టినా ఎంపీ సంతోష్ గారికి చేతులెత్తి మొక్కుతున్న. మొక్కలు నాటుతూ..నాటిస్తూ ఎంతో మంది కి ఆక్సిజన్ అందిస్తున్నారు