ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా 21 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో మొత్తం 21,116 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక క‌రోనా పాజిటివ్ కేసులు కూడా 5 ల‌క్ష‌ల‌కు చేరువ‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 4,65,274 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా తేలింది.
క‌రోనా పాజిటివ్ కేసుల విష‌యానికి వ‌స్తే.. 81,285 కేసుల‌తో చైనా మొద‌టి స్థానంలో ఉండ‌గా.. 74,386 కేసుల‌తో ఇట‌లీ ఆ త‌ర్వాత స్థానంలో ఉంది. ఇక మ‌ర‌ణాల విష‌యంలో మాత్రం 7,503 మ‌ర‌ణాల‌తో ఇట‌లీ మొద‌టి స్థానంలో ఉండగా.. చైనా 3,287 కేసుల‌తో మూడు స్థానంలో ఉంది. 3,607 మ‌ర‌ణాలతో స్పెయిన్ రెండో స్థానానికి వెళ్లింది. ఆ త‌ర్వాత వెయ్యికిపైగా మ‌ర‌ణాలు సంభించిన దేశాల్లో ఇరాన్, ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇరాన్‌లో 2,077 మ‌ర‌ణాలు చోటుచేసుకోగా.. ఫ్రాన్స్‌లో 1,331 మంది మ‌ర‌ణించారు.