
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో ఎప్పటికప్పుడు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తోంది ప్రభుత్వం. సామాజిక దూరాన్ని పాటించి కరోనాను తుదముట్టించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. కఠినతర స్వీయ నియంత్రణే మానవాళికి శ్రీరామరక్ష అనే వాస్తవాన్ని ఎవరూ కూడా విస్మరించవద్దని పేర్కొంది. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసింది.
ఇటీవలి కాలంలో విదేశాల నుంచి లేదా దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను స్వచ్ఛందంగా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి తెలియజేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కోరింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయాలని చెప్పింది. ఇప్పటికే పలు పట్టణాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను క్వారంటైన్లో ఉంచుతున్నారు.
కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్స్..040-23450624040-23450735