నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య, మార్కెటింగ్‌, పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అత్యవసర సరుకుల అందుబాటు, వరి, మక్కజొన్న సేకరణ తదితర అంశాలపై సమీక్షిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.