
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్లో సమీక్షించారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా వివిధ రకాల చెల్లింపులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసకున్నారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు: రాష్ట్రకార్పొరేషన్ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత
ఆలిండియా సివిల్ సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత
మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత
నాలుగవ తరగతి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత
అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత
నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత
అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపు
ప్రభుత్వ గ్రాంటు పొంందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత