తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది మృత్యువాత పడ్డారు. 45 మంది కరోనా బాధితులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 414 మంది చికిత్స పొందుతున్నారు. మర్కజ్‌ వెళ్లిన వారికి అందరికీ వైరస్‌ నిర్ధారన పరీక్షలు ముగిశాయి. గత వారంలో రోజుల పరిస్థితికి ఇప్పటికి కాస్తా మెరుగుపడినట్లు అనిపిస్తుంది. ప్రతి రోజూ 40 నుంచి 50 పాజిటివ్‌ కేసులు వచ్చినవి ప్రస్తుతం 18 కేసులకు పడిపోయింది.