
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కొవిడ్-19 నోడల్ అధికారి తెలిపారు. గుంటూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో 2 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కొత్తగా నమోదైన 16 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరింది. ఈ వైరస్ బారి నుంచి 10 మంది కోలుకోగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
అనంతపూర్ జిల్లాలో 15, చిత్తూరులో 20, తూర్పు గోదావరిలో 17, గుంటూరులో 58, కడపలో 29, కృష్ణాలో 35, కర్నూల్లో 77, నెల్లూరులో 48, ప్రకాశంలో 40, విశాఖపట్టణంలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కేసులు నమోదు అయ్యాయి.