అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ సమీక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించే విషయంపై మోదీ కీలకంగా చర్చిస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకుంటున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధాని మోదీని కోరాయి. ముఖ్యమంత్రులతో సమీక్ష అనంతరం లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారు.