ఏపీలో 420కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 420కి చేరింది. కొత్తగా  15 మందికి కరోనా మహమ్మారి సోకింది.  గుంటూరులో 7, నెల్లూరు 4, కర్నూలు 2, చిత్తూరు, కడపలో ఒక్కో కొత్త కేసు నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇప్పటి వరకు ఏపీలో ఏడుగురు కరోనా బారినపడి చనిపోగా..12 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం ఆస్పత్రుల్లో 401 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 84 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు(82), నెల్లూరు(52) ఎక్కువగా కరోనా బాధితులున్నారు.