ఏపీలో 22478 మందిపై క్వారంటైన్‌ నిఘా: ఏపీ డీజీపీ

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. కరోనా వైరస్‌ నుంచి పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వివిధ దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాం. దేశంలోనే మొదటి సారిగా హోంక్వారంటైన్‌ యాప్‌ ద్వారా జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీతో పర్యవేక్షించాం. 22,478 మంది 28 రోజుల పాటు నిఘా ఏర్పాటు చేశాం. 

జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేశాం. యాప్‌ ద్వారా అత్యధికంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలిసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పించాం. రెడ్‌జోన్‌ ప్రాంతంలో నిఘాకోసం సాంకేతిక పరిజ్ఞానంతో మరో మొబైల్‌ యాప్‌ సిద్ధం చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు పోలీసు శాఖకు సహకరించడం వారి దేశభక్తికి నిదర్శనం. కరోనా కట్టడికి సహకరించిన అందరికి సర్వదా రుణపడి ఉంటామని తెలిపారు.