క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ తో పాటు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి కూడా పాల్గొన్నారు.