పీఏసీ చైర్‌పర్సన్‌గా అధిర్‌ రంజన్‌ చౌదురి

 పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదురి నియమితులయ్యారు. చైర్మన్‌ సహా లోక్‌సభ, రాజ్యసభ నుంచి 22 మందిని సభ్యులుగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ కాలపరిమితి మే 1 నుంచి 2021, ఏప్రిల్‌ 30 వరకు ఉంటుందని వెల్లడించారు. ఇందులో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులుగా ఉన్నారు.