మంచిర్యాల : కరోనా వైరస్ మంచిర్యాల జిల్లాను కలవర పెడుతోంది. ముంబయి నుంచి సొంతూర్లకు తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా కొవిడ్-19 నోడల్ ఆఫీసర్ బాలాజీ మీడియాకు వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన వారిలో దండెపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, బెల్లంపల్లికి చెందిన వారున్నారు. వీరందరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు అధికారులు. కొద్ది రోజుల క్రితమే వీరు ముంబయి నుంచి సొంతూర్లకు తిరిగొచ్చినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 17 మంది వలస కార్మికులే.
