ఎల్ జీ పాలిమర్స్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం

విశాఖ జిల్లా ఆర్. ఆర్. వెంకటాపురంలోని ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎల్ జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని తెలిపింది అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాక ఎవరినడిగి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించారని ధర్మాసనం ప్రశించింది. గ్యాస్ లీక్ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కొద్ది రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ మేరకు విచారణకు సంబంధించిన తీర్పు కాపీని కోర్టు ఈ రోజు విడుదల చేసింది.
ఎల్ జీ పాలిమర్స్, ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి వారి వాదనలు వినిపించారు. గ్యాస్ లీకేజీ జరిగిన తర్వాత స్టైరీన్ ను ఎవరి అనుమతితో ఇక్కడ నుంచి తరలించారని.. లాక్ డౌన్ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని ప్రశ్నించించి. జనావాసాల మధ్య ప్రమాదకర గ్యాస్ ను ఎలా స్టోర్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.