తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 650. కాగా కోవిడ్-19తో రాష్ట్రంలో నేడు ఒకరు మృతిచెందారు. వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 57 మంది చనిపోయారు. కోవిడ్-19 నుంచి కోలుకుని నేడు 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 1284 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి-7, మేడ్చల్-6, వలస కూలీలు-12, విదేశాల నుంచి వచ్చినవారు-4, సూర్యాపేట-1, వికారాబాద్-1, నల్లగొండ-1, నారాయణపేట-1.
