ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొత్తగా నమోదైన వాటిలో 9 కేసులు కోయంబేడుతో సంబంధం ఉన్న కేసులు. ఏపీలో ఇప్పటి వరకు 2,787 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 58 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 816 కాగా, 1913 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
