తెలంగాణ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లాక్డౌన్ను హైకోర్టు మరోమారు పొడిగించింది. కరోనా నేపథ్యంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ను వచ్చే నెల 6వ తేదీవరకు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఆన్లైన్లో, నేరుగా పిటిషన్ల దాఖలుకు అనుమతించింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
