సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

భారత్‌, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రారంభమయ్యాయి.

ఆర్మీ అధికారులు, మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌  తదితర జిల్లా అధికారులు  సంతోష్‌బాబు  పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకు ముందు వీర జవాన్‌ తల్లిదండ్రులు, భార్య  సంప్రాదాయ ప్రకారం సంతోష్‌బాబు నోటిలో తులసి నీళ్లు పోశారు.  అంతిమయాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు. కేసారం వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న  అంతక్రియలకు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మొత్తం 50 మందికి మాత్రమే ఆర్మీ అధికారులు అనుమతి ఇచ్చారు. చివరిసారిగా కల్నల్‌ మృతదేహాన్ని చేసేందుకు సూర్యాపేట వాసులు తరలివచ్చి నివాళులు అర్పించారు.