ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠతకు తెరపడింది. ఊహించినట్లుగానే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. సాయంత్ర వెలువడిన ఫలితాల్లో ఆపార్టీ కి చెందిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వాని గెలుపొందారు. టీడీపీ అభ్యర్థులు వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. వర్ల రామయ్యకు కేవలం 17ఓట్లుమాత్రమే వచ్చాయి. ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో పోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని 175మంది ఎమ్మెల్యేలకు 170మంది ఓటేసినట్లు సమాచారం. జనసేన నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్‌ అధికార పార్టీకి ఓటేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయన జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహిరస్తున్న సంగతి తెలిసిందే.