ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా హరిత విప్లవం తీసుకొచ్చారని, పర్యావరణాన్ని రక్షించడం అందరూ బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
మన రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పర్యావరణానికి పెద్ద పీఠ వేశారు, కలప వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టారు. అర్బన్ పార్కుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుంది అన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.. యాదాద్రి జిల్లా కలెక్టర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్, రాచకొండ సిపి గార్లను మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
