ఏపీలో 27 మంది సచివాలయ,అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా  ఏపీ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ  కలకలం రేపుతుంది. గత నెల 25న  సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులందరీకీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో10 మందికి,  జలవనరుల శాఖలో ముగ్గురికి, పశుసంవర్ధక శాఖలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు సచివాలయం, అసెంబ్లీలో పనిచేస్తూ కరోనా బారిన పడ్డ ఉద్యోగుల సంఖ్య 27కు చేరుకుంది . కరోనా నిర్ధారణ అయిన ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగిన వారు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని గురువారం  ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరి ఆదేశాల మేరకు గురువారం పలువురు ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారు.