శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఒక్కరోజే  హుండీ రూపేణా ఆలయానికి రూ.71లక్షలు ఆదాయం వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ నెల 14నుంచి  శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా దృష్ట్యా భక్తులు తగు జాగ్రత్తలతో ఆలయానికి రావాలని సూచించారు.